పట్టణ ప్రగతి ద్వారా పరిశుభ్రత – మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మేఘ హిల్స్, శ్రీరామ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీల్లోని చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్థీ, ఎస్ఆర్ పి శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, మేఘ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కృష్ణా రెడ్డి, కౌశిక్ రెడ్డి, వార్డు సభ్యులు రామచందర్, గుమ్మడి శ్రీనివాస్, శ్రీరామ్మూర్తి, సూర్య రావు, రవీందర్ రెడ్డి, రజిత, ధనరాజ్ ముదిరాజ్, మోహన్,నర్సి రెడ్డి, సత్యనారాయణ యాదవ్, రామకృష్ణ, సుబ్బా రెడ్డి, వి.ఎస్.ఎన్ రాజు, అసిఫ్, వర్క్ ఇన్స్పెక్టర్లు చారి, శర్మ, ఎలక్ట్రికల్ ప్రేమ తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో సమస్యలు తెలుసుకుంటున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here