పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారం – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో జీహెచ్ఎంసీ, ఆయా శాఖల అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై కాలనీ వాసులతో చర్చించారు. కాలనీలలో పారిశుధ్య పనులను పర్యవేక్షించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసులు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, కాలనీ వాసులు వరలక్ష్మి రెడ్డి, పుల్లిపాటి నాగరాజు, ఓ వెంకటేష్, రవీందర్ రెడ్డి, నరేందర్ భల్లా, అక్బర్ ఖాన్, అంజాద్ పాషా, దాస్, కొండల్ రెడ్డి, కార్తీక్ గౌడ్, దీక్షిత్ రెడ్డి, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అఫ్సర్, గౌరవ్, పండు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో మురికి కాలువలను శుభ్రం చేయిస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here