మోదీ పాలనకు మరోసారి పట్టం‌ కట్టిన ప్రజలు – శేరిలింగంపల్లి లో బిజెపి విజయోత్సవ ర్యాలీలు

నమస్తే శేరిలింగంపల్లి: నాలుగు రాష్ట్రాల్లో బిజెపి‌ ‌విజయ‌ ఢంకా మోగించడం పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని‌ బిజెపి‌ నాయకులు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ నుండి మియాపూర్, చందా నగర్, లింగంపల్లి వరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్, మొవ్వా సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, నరేష్, గోవర్ధన్ గౌడ్, గంగాధర్ రెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి లేని అభివృద్ధే లక్ష్యంగా కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి డబల్ ఇంజిన్ పరిపాలనకు నాలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు ద్వారా సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. బిజెపిపై ఎంత మంది కుట్రలు పన్నినా, దుష్ప్రచారం చేసినా దేశాభివృద్ధియే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పాలనకు ప్రజలు పట్టం‌ కట్టారని అన్నారు. దేశంలో ఎన్నిక ఏదైనా ఎగిరేది కాషాయపు జెండానే అని ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, డీఎస్ఆర్ కె ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, శ్రీధర్ రావు, ఆంజనేయులు, నవీన్ గౌడ్, భూపాల్ రెడ్డి, రాజు శెట్టి, కాంటెస్ట్ కార్పొరేటర్ రాధాకృష్ణ, నాయకులు మహేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి, హనుమాన్ నాయక్, శ్రీశైలం సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద బిజెపి నాయకుల విజయోత్సవ సంబరాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here