నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు తదితర మౌళిక వసతులను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ నగర్ లో ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేపట్టారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. రాజకీయలకతీతంగా అభివృద్ధి చేశామని రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సమస్య లేకుండా చూశామని చెప్పారు. కాలనీలో ముఖ్యంగా డ్రైనేజీ, మంచి నీరు , రోడ్లు, వీధి దీపాలు, లో ఓల్టేజ్, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.మార్తాండ్ నగర్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ జగదీష్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, తిరుపతి , తాడెం మహేందర్, ఎండి గపూర్, కలీం, కా శెట్టి అంజి, లక్ష్మి, శ్రీనివాస్, సమంత , జాఫర్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.