రాష్ట్ర వికలాంగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షునిగా గౌని యాదగిరి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సేవా సంఘం గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులుగా గౌని యాదగిరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షునిగా గౌని యాదగిరిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి మహబూబ్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా
గౌనియాదగిరి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ వికలాంగుల సేవ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గౌని యాదగిరి పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరు‌నా కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర వికలాంగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు గౌని యాదగిరి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here