నమస్తే శేరిలింగంపల్లి: కరోనా థర్డ్ వేవ్ నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున గ్రామర్ హై స్కూల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించుకుని, వైద్యుల సూచనలు, సలహాలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కే. లక్ష్మణ్, కరస్పాండెంట్ శ్రీనివాస్, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.