నమస్తే శేరిలింగంపల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని బిజెపి నాయకులు మూల అనిల్ గౌడ్ ఆకాంక్షించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురా నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో భారత ప్రధాని నరేందర్ మోడీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూల అనిల్ గౌడ్, రమేష్, సోమిశెట్టి, రవీందర్ రెడ్డి, నీల నరేందర్ ముదిరాజ్, డివిజన్ మహిళా నాయకురాలు మహేశ్వరి, చెట్టి మహేందర్ గౌడ్, నీలం సురేందర్ ముదిరాజ్, అంబటి అశోక్, రావులకొల్లు వెంకటేష్, సంజీవ్, నక్క శివ కుమార్, రవి కుమార్ ముదిరాజ్, శ్యామ్, విజయ్, సాయి కుమార్, ప్రవీణ్ యాదవ్, బిల్డర్ శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.