యూజీడీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియపూర్ డివిజన్ పరిధిలోని మాయూరీ నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ భూగర్భ డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కాలనీలలో ఏ సమస్య ఉన్న పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్ స్పెక్టర్లు విశ్వనాథ్, జగదీష్, చంద్రికప్రసాద్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here