దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతాం – యూజీడీ పనులు పరిశీలించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో నూతనంగా మంజూరై చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను డి.ఈ స్రవంతితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు ముక్తర్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు కృష్ణ యాదవ్, నాయకులు సత్యనారాయణ, రాములు యాదవ్, బుజంగం, అప్పల్ రాజు యాదవ్, సాజిద్, అంకారావు, బృందా రావు, యూత్ నాయకులు రవి, శ్రీకాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్ చంద్రబోస్ నగర్ లో పర్యటిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here