శిల్పారామంలో అలరించిన నృత్యప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. భరతనాట్య ప్రదర్శనలో భాగంగా రష్మీ సచ్చిదానందా శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం పుష్పాంజలి,  కడగోల తరణ, పిల్లనగోవి, ముద్దుగారేయ్ యశోద, గరుడ గమన తదితర అంశాలను ప్రదర్శించి పలువురిని ఎంతగానో మెప్పించారు.డాక్టర్ లలిత సింధూరి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఝేమ్ ఝేమ్ తనను, భో శంభో, నారాయణతేయ్ నమో నమో, మానస సంచరరేయ్, హిందోళ తిల్లాన  అంశాలను సంజన, రుత్విక, చరిష్మా, భవ్య, వైశాలి , నిశిత  లు ప్రదర్శనలు‌ ఆకట్టుకున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here