ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేసిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో వాసవి క్లబ్ వారి సహకారంతో విద్యార్థులకు నూతన బ్యాగులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పాటు పడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ భాను శిరీష, సభ్యులు శేషు కుమార్ ప్రభావతి, లక్ష్మీ, స్థానిక నాయకులు రాజు గౌడ్, రవి గౌడ్, జంగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులను అందజేస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here