ఢాక్‌స‌ద‌న్‌లో ఘ‌నంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం… ప్రత్యేక పోస్ట‌ల్ క‌వ‌ర్‌, పోస్ట‌ల్ స్టాంపు ఆవిష్క‌రణ‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఢాక్‌స‌ద‌న్‌లో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ స‌ర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌.రాజేంద్ర కుమార్, పీవీఎస్ రెడ్డీలు సిబ్బందితో క‌ల‌సి ఆయుష్ మంత్రాల‌య పిలుపుమేర‌కు ఆన్‌లైన్ ద్వారా యోగ ప్రోటోకాల్‌ను ఆచ‌రించారు. అనంత‌రం 7వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా రూపొందించిన ప్ర‌త్యేక పోస్ట‌ల్ క‌వ‌ర్‌, పోస్ట‌ల్ స్టాంపును ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల‌లో అధికారికంగా అంత‌ర్జాతీయ యోగాదినోత్స‌వం జ‌రుపుకోవ‌డం భారతీయ ప్రాచీన యోగాకు ద‌క్కిన అపూర్వ గౌర‌వ‌మ‌ని అన్నారు. పోస్ట‌ల్ సిబ్బందితో క‌ల‌సి యోగా ఆచ‌రించ‌డం, అంత‌ర్జాతీయ యోగ దినోత్సవం పేరిట ప్ర‌త్యే పోస్ట‌ల్ క‌వ‌ర్‌, పోస్ట‌ల్ స్టాంపుల‌ను ఆవిష్కరించుకోవడం ఎంతో సంతృప్తిని క‌లిగించింద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పోస్ట‌ల్ సిబ్బంది పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

ఢాక్‌స‌ద‌న్‌లో సిబ్బందితో క‌ల‌సి యోగా ప్రోటోకాల్ ఆచ‌రిస్తున్న తెలంగాణ స‌ర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌.రాజేంద్ర కుమార్
అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ ప్రత్యేక పోస్ట‌ల్ క‌వ‌ర్‌, పోస్ట‌ల్ స్టాంపుల‌ను ఆవిష్క‌రిస్తున్న రాజేంద్ర కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here