యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాలంటీర్ల‌కు స‌న్మానం

  • కార్య‌క్ర‌మానికి సీపీ స‌జ్జ‌నార్‌ను ఆహ్వానించిన సంస్థ ప్ర‌తినిధులు

సైబ‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో సేవ‌లు అందించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (యాక్‌) వాలంటీర్ల‌కు ఈ నెల 10వ తేదీన స‌న్మాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్‌ను ఆ సంస్థ ప్ర‌తినిధులు గురువారం క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, సంస్థ మీడియా సెక్రటరీ జి. జయరాంలు సీపీని స‌ద‌రు స‌న్మాన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రావాల‌ని ఆహ్వానించారు.

సీపీ స‌జ్జ‌నార్‌ను స‌న్మాన కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తున్న సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, మీడియా సెక్రటరీ జి. జయరాం

ఈ సంద‌ర్బంగా రాజేంద్ర‌, జ‌య‌రాంలు మాట్లాడుతూ.. త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో ఎంతో మంది వాలంటీర్లు క‌రోనా లాక్ డౌన్ సమయంలో వృద్దులు, వికలాంగులు, గర్భిణీలకు సేవ‌ల‌ను అందించార‌ని తెలిపారు. అందులో భాగంగానే వాలంటీర్లను స‌న్మానించ‌నున్నామ‌ని అన్నారు. ఆ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 10వ తేదీన న‌గ‌రంలో నిర్వ‌హించనున్నామ‌ని, ఆ కార్యక్ర‌మానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న త‌మ సంస్థ ప్ర‌తినిధులు, వాలంటీర్లు హాజ‌రు అవుతార‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here