హఫీజ్పేట్(నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్ సోమవారం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్గౌడ్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కంది జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ అని, జనం నుండి పుట్టిన నాయకుడు జననాయకుడు అవుతారని, అభిమానం అంటే అవసరాలకోసం వేచి చూసేది, అవసరాలు తీరాక వదిలివెళ్లేది కాదని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన అభిమానమని, జగదీశ్వర్గౌడ్ అలాంటి అభిమానులను ఎంతో మందిని సంపాదించుకున్నారని అన్నారు.






