భూగర్భ డ్రైనేజి సమస్యలను పరిష్కరించండి: కార్పొరేటర్ లక్ష్మీబాయి

జలమండలి జిఎం కు వినతిపత్రం సమర్పిస్తున్న కార్పొరేటర్ లక్ష్మీబాయి

వివేకానందనగర్ : శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని వివేకానందనగర్ డివిజన్ లో భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ లక్ష్మీబాయి అధికారులను కోరారు. మంగళవారం జలమండలి జనరల్  మేనేజర్ వినోద్ భార్గవ్ గారితో సమావేశం అయిన కార్పొరేటర్ పలు సమస్యల పై చర్చించారు. డివిజన్లో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, కొత్త పైప్ లైన్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారని వీలైనంత త్వరగా పనులు ప్రాంరంబిస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here