శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు విజేత జగన్ మోహన్ రావు రూ. 9.45 లక్షల నిధి సమర్పణ

చందాన‌గ‌ర్(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణానికి విజేత సూప‌ర్‌మార్కెట్ సంస్థ‌ల అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రావు రూ. 9.45 ల‌క్ష‌ల నిధి స‌మ‌ర్ప‌ణ చేశారు. రామ మందిర నిర్మాణ జనజాగరణలో భాగంగా గురువారం బిజేపి రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు తోపుగొండ మహిపాల్ రెడ్డి ఆద్వర్యంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ కూకట్ పల్లి జిల్లా సంపర్క్ ప్రముఖ్ రమణారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ లు జగన్ మోహన్ రావును క‌లిసి శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ భవ్య రామ మందిర నిర్మాణ ప్రాధాన్యత, ప్రణాళికను వారికి వివరించారు. స్పందించిన జగన్ మోహన్ రావు నిధి సమర్పణలో తనవంతుగా రూ.9.45 లక్షల చెక్కును వారు నందకుమార్ యాదవ్ కు అందజేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ ఆదర్శ పురుషుడు రాముడిని సేవించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ విహార్ ఫేజ్ 2 అధ్యక్షులు కరుణాకర్, రామసేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్, అందెల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు నిధి స‌మ‌ర్ప‌ణ చేస్తున్న విజేత జ‌గ‌న్ మోహ‌న్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here