అటల్ బిహారీ వాజ్ పేయికి చందానగర్ డివిజన్ భాజపా నేతల ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు.. ఆ మహానుభావుని సేవలు, ఆయన మంచితనం, నేర్పరితనం ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నేటి సమాజం పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో D శివకుమార్, G. శ్రీనివాస్ ముదిరాజ్, p. వేణు గోపాల్, జ్ఞాన చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, సాయికుమార్ నేత, నాగేశ్వర రావు, లలిత, అమరేందర్ సింగ్, కృష్ణ మోహన్, సుధాకర్ యాదవ్, సందీప్ కుమార్, రమణ కుమారి, రాధిక, వనమా శ్రీనివాస్ పాల్గొన్నారు.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి కి నివాళి అర్పిస్తున్న రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here