కరోనా నివారణకు వ్యాక్సినేషన్ అత్యంత సురక్షితమైనది: హరికృష్ణ

కరోనా వ్యాక్సినేషన్ లో పాల్గొన్న ఆసుపత్రి ఈడీ హరికృష్ణ

మెడికవర్ హాస్పిటల్ ఈ డి హరికృష్ణ
కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇది అత్యంత సురక్షితమైన మార్గమని మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. గురువారం ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ చేయించుకున్న అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ సమకాలీన మానవ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రజా ఆరోగ్య కార్యక్రమాలలో ఒకటని తెలిపారు. పలు రోగాలను అంతం చేయడానికి మరియు మరెన్నో ఇతర సమస్యలు రాకుండా నిరోధించడానికి ఇది తోడ్పడుతుందన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అత్యంత సమర్థవంతమైన వ్యాక్సినేషన్‌ను సమయానికి భారతదేశం తీసుకువచ్చిందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతున్న వేళ, భారత ప్రభుత్వం ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మెడికవర్‌ ఆస్పత్రి భాగమైందని తెలిపారు. వైద్య సేవలు అందించే లరతీ ఒక్కరూ అందరూ ఎలాంటి ఆందోళనకూ గురికాకుండా ఈ వ్యాక్సిన్‌తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here