టిఆర్ఎస్ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వ‌మ‌ని నిరూపించిన కెసిఆర్‌: స‌య్య‌ద్ యూసుఫ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఫిట్‌మెంట్ తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించి తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వమ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ నిరూపించార‌ని మ‌దీనాగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్రధానోపాధ్యాయులు స‌య్య‌ద్ యూసుఫ్ అన్నారు. ఉద్యోగుల అంచ‌నాల‌కు అనుగుణంగా 30 శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌యోప‌రిమితి, గ్రాట్యుటీ పెంపు, సిపిఎస్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల కు ప‌రిష్కారం చూప‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఉద్యోగుల ప‌దోన్న‌తి, బ‌దిలీల ప్ర‌క్రియ‌, 2018 నుండి పిఆర్‌సి బ‌కాయిలు అమ‌ల‌య్యేలా చూడాల‌ని కోరారు. ఎన్న‌డూ లేని విధంగా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

స‌య్య‌ద్ యూసుఫ్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here