ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సుర‌భి వాణీదేవి విజ‌యంతో శేరిలింగంప‌ల్లిలో పార్టీ శ్రేణుల సంబ‌రాలు

  • టిఆర్ఎస్ విజ‌యానికి కృషి చేసిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు: ప్ర‌‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సురభి వాణి దేవి విజ‌యంతో శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గ టిఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా మిఠాయిలు పంచుకున్న నాయ‌కులు సుర‌భివాణీదేవికి అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గారు మాట్లాడుతూ ఎన్నికలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని టిఆర్ఎస్‌ విజయానికి కారకులైన ప్రతి ఒక్క పట్టభద్రుల ఓట‌రుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి గంగుల కమలాకర్, టియుఎఫ్ఐడిసి ఛైర్మెన్ విప్ల‌వ్‌ కుమార్ ల‌తో పాటు సురభివాణి గెలుపు కొరకు అహర్నిశలు క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తీ టిఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవితో ప్ర‌భుత్వ విప్ గాంధీ(పాత‌చిత్రం)

కొండాపూర్ డివిజ‌న్‌లో…
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సుర‌భివాణీ దేవి విజ‌యంతో కొండాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్ ఆధ్వ‌ర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేద‌ని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విజ‌యంతో మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని హ‌మీద్‌ప‌టేల్ అన్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యానికి కృషి చేసిన వారంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

విజ‌యోత్స‌వ సంబురాల్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్‌

టిఆర్ఎస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగింది: ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌
ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సుర‌భివాణీదేవి విజ‌యంతో పార్టీపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగింద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని మియాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ అన్నారు. పార్టీ విజ‌యానికి కృషి చేసిన ప్ర‌తీ నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…
గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ఖాజాగూడ టిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి సంబ‌రాలు నిర్వ‌హించుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మిఠాయిలు పంచుకున్నారు. అనంత‌రం సాయిబాబ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి శ్ర‌మించిన
ఎమ్మెల్సీ పట్టుభద్రుల ఇంఛార్జి వాసల రమేష్, డివిజన్ ఎమ్మెల్సీ ఇంచార్జీలతో పాటు పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ‌

వాణి దేవి విజయం టిఆర్ఎస్ ప్రభుత్వ విజయం: చంద్రిక ప్ర‌సాద్‌గౌడ్‌
ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సుర‌భివాణీదేవి గెలుపొంద‌డం టిఆర్ఎస్ పార్టీ విజ‌యమ‌ని మియాపూర్ డివిజ‌న్ టిఆర్ఎస్ ప్ర‌ధానకార్య‌ద‌ర్శి చంద్రిక ప్ర‌సాద్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ప‌ట్ట‌భ‌ద్రులు సైతం కెసిఆర్ పాల‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని, న‌ల్గొండ సిట్టింగ్ స్థానంతో పాటు బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవ‌డం ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల గ‌ల విశ్వాసానికి ప్ర‌తీక అన్నారు. ప్రపంచ మేధావి మన తెలంగాణ ఠీవి పివి కుమార్తెకు టికెట్ కేటాయించి, విద్యావంతుల స‌భ‌కు పంపాల‌నే కెసిఆర్ నిర్ణ‌యం గొప్ప‌విష‌య‌మ‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో విజ‌యానికి కృషి చేసిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఓట‌ర్ల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

చంద్రిక ప్ర‌సాద్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here