
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో గల శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ పాలకమండలి ఇటీవల నూతనంగా ఎన్నికైంది. చైర్మన్ గా చెన్నం రాజు ముదిరాజ్, సభ్యులుగా ఆకుల యాదగిరి, వసంత్ కుమార్, రవీందర్, నరేందర్ గౌడ్, రాధా, రమేష్ లు నియమితులయ్యారు. కాగా ఎండోమెంట్ అధికారి(ఈఓ) విజయభారతి, ఇన్స్పెక్టర్ మధు బాబుల పర్యవేక్షణలో సోమవారం పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, డివిజన్ టిఆర్ఎస్ గౌరవాధ్యక్షుడు నిరుడి గణేష్ ముదిరాజ్, అధ్యక్షుడు రాజు నాయక్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధి తో పాటు భక్తుల సౌకర్యం కోసం ఇస్తామని నూతన చైర్మన్ చెన్నంరాజు ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, జనార్ధన్, వినోద్, జగదీష్, మీనా, మల్లేష్, మల్లికార్జున శర్మ, కుష చారి, రాధాకృష్ణ, బాలకృష్ణ, నారాయణ, వెంకటేష్ పాల్గొన్నారు.
