లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్ప ఎనక్లేవ్ కాలనీలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆర్య వైశ్య సంఘం చందానగర్ ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి వేడుకలు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

ఈ వేడుకలలో భాగంగా నిర్వహించిన కళశ యాత్ర లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పబ్బా మల్లేష్ గుప్తా, పాసుమూర్తి శ్రీనివాస్, పబ్బా శ్రీనివాస్ , వర్మ శ్రీనివాస్, రోహిత్, జయకృష్ణ, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీ గణపతి దేవాలయంలో నిర్వహించిన కళశ యాత్ర లో పాల్గొన్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here