నమస్తే శేరిలింగంపల్లి : అమెరికాలో అందించే క్యాన్సర్ వైద్యం హైదరాబాద్ లో అందుబాటులోకీ రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని ప్రైవేటు హాస్పిటల్స్ కు సూచించారు. మారుతున్న టెక్నాలజీనీ అందిపుచ్చుకుని వైద్యం అందించాలని చెప్పారు.