సమస్యల పరిష్కారానికి పాదయత్ర

  • సిసి రోడ్ల పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఎ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ల పనుల పరిశీలన, స్టాలిన్ నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై GHMC అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ M A నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులను పరిశీలించామని, సీసీ రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదన్నారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. స్టాలిన్ నగర్ కాలనీలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజి, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో విడతలవారీగా పరిష్కరిస్తామని, డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈ ప్రవీణ్, ఎ ఈ శివప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, స్థానిక నాయకులు రవి గౌడ్, జంగం మల్లేష్, వెంకటేష్, రాణి, లత, భాస్కర్, వెల్డింగ్ రాజు, చంద్రయ్య, శివలిల, దేవేందర్ , కాంతారావు, నరేష్ పాల్గొన్నారు.

ఎంఎ నగర్ కాలనీలో పాదయాత్ర చెస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here