ముస్లిం మైనారిటీ ప‌ట్ట‌భధ్రుల‌కు ఎమ్మెల్సీ ఓట‌రు న‌మోదుపై అవ‌గాహ‌న

విద్యానగర్ కార్యాలయంలో మైనారిటీ పట్టభద్రలకు ఫామ్ 18లు అందచేస్తున్న‌కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ బొబ్ న‌వ‌త రెడ్డి ఆద్వ‌ర్యంలో విద్యాన‌గ‌ర్ పార్టీ కార్యాల‌యంలో ముస్లిం మైనారిటీ ప‌ట్ట‌భధ్రుల‌కు ఎమ్మెల్సీ ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా న‌వ‌త‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ ముస్లిం మైనారిటీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సభ్యులు పనిచేయాలని, గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాలు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్ర‌భుత్వ విప్ గాంధీ సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న మైనారిటీ పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు. 2017 సంవత్సరం నాటికి డిగ్రీ (డిప్లమా) పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫార్మ్ 18)తో పాటు దృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here