మియాపూర్ ప్రజల ప్రశ్నించే గొంతుక పల్లె మురళి : తాండ్ర కుమార్

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): నిరంతర పోరాట పటిమతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక ఎంసిపిఐ యు పార్టీ అభ్యర్థి పల్లె మురళి అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ అన్నారు. మియాపూర్ డివిజన్ అభ్యర్థిగా మురళిని ఎంపిక చేసిన సందర్బంగా తాండ్రకుమార్ మురళి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తాండ్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మురళి సమస్యల అధ్యయనం చేయడం అలవర్చుకొని వాటి పరిష్కారం కోసం పలు ఉద్యమాల్లో చురుకుగా పని చేశాడని తెలిపారు. అనేక ప్రజా సమస్యల పై ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు తన నియోజకవర్గపు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేను సైతం డికొంటు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా మారాడని అన్నారు. నోటుకు- ఓటు అనే గబ్బిలాలను తరిమి కొట్టి, స్వచ్ఛమైన ఓట్ల కోసం ఎంసిపిఐ యు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచాడని తెలిపారు. అనంతరం పల్లె మురళి మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ అభివృద్ధి ఏకైక ఎజెండాతో డివిజన్ లో నెలకొన్న ఇంటి పట్టాల సమస్యలు, డ్రైనేజీ తదితర సమస్యల సాధన, అవినీతి అక్రమార్కుల ఆగడాలకు ముగింపు పలికి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. డివిజన్ ప్రజలంతా సిలిండర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

మియాపూర్ ఎంసిపిఐ యు అభ్యర్థి మురళి ని అభినందిస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here