నవంబర్ లో అఖిలభారత మహాసభలు లోగో ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ తాండ్ర రామచంద్రయ్య భవన్ ఎదుట MCPIU పార్టీ అఖిలభారత మహాసభల లోగో ఆవిష్కరణ సందర్భంగా నవంబర్ 12 ,13, 14 తేదీలలో ఎంసిపిఐ (యూ) అఖిలభారత మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ తెలిపారు. ఈ మహాసభలకు 14 రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే దేశంలో నెలకొన్న సమస్యలపై వివిధ వామపక్ష ప్రజాసంఘాల పార్టీల జాతియ నాయకులు సహర్ద సందేశం ఇవ్వడానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి మదన్ శెట్టి రమేష్, గ్రేటర్ కమిటీ సభ్యులు రాంబాబు, కర్ర దానయ్య, పల్లె మురళి, అంగడి పుష్ప, విమల, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు సుల్తానా, శ్రీలత, లావణ్య, రాములు పాల్గొన్నారు.

మియాపూర్ తాండ్ర రామచంద్రయ్య భవన్ ఎదుట MCPIU పార్టీ అఖిలభారత మహాసభల లోగోను ఆవిష్కరిస్తున్న పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here