శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్, సుజాత యాదవ్ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నేత రాగం అనిరుధ్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవాధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్లు సోమదాస్, రవీందర్ రావు, సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, వార్డు మెంబర్లు రాంబాబు, శ్రీకళ, కవిత, పర్వీన్, గోపీ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ యుత్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్లోళ నర్సింహారెడ్డి, రాజ్ కుమార్ ముదిరాజ్, గణపురం రవీందర్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణ గౌడ్, సైదులు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







