మ‌క్త మ‌హ‌బూబ్‌పేట్‌ ఎస్‌సీ బ‌స్తీకి నీటి తిప్ప‌లు… ట్యాంక‌ర్ల‌తో ఉచితంగా నీరు అందిస్తున్న‌ ఆర్‌కేవై టీం…

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట్‌లోని ఎస్‌సీ బ‌స్తీలో ఆర్‌కేవై టీమ్ మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేస్తూ స్థానికుల‌కు బాస‌ట‌గా నిలుస్తుంది. నీటి సరఫరా లేక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంట‌నే సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేత, ఆర్‌కేవై టీమ్‌ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా మ‌క్త ఎస్‌సీ బ‌స్తీలోని ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్‌కేవై టీమ్‌ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి తాత్కాలికంగా సమస్యను పరిష్కరస్తు్నామ‌ని, అందుకు స్థానిక‌ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నార‌ని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ బస్తి లో నెలకొన్న నీటి సమస్యను తీర్చాలని‌ విజ్ఞప్తి ‌చేశారు. స్థానికంగా నీటిసేవ‌లందిస్తున్నవారిలో ఆర్‌కేవై టీం స‌భ్యులు గంగారం మల్లేష్, జాజా రావ్ శ్రీను, జాజారావు రమేష్, జాజారావు రాము, సారా రవీందర్, రమేష్ తదితరులు ఉన్నారు.

ట్యాంకర్ ద్వారా నీటిని పట్టుకుంటున్న ఎస్‌సీ బ‌స్తీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here