యూజీడీ పనుల పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధిలో దశల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లో నూతనంగా చేపట్టిన యూజీడీ పనులను గురువారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here