యూజీడీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ‌ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్, ఆర్టీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను బస్తీ నాయకులతో కలిసి బుధవారం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. పనులు త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి‌ వచ్చేలా చూస్తామని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ నాయకులు దేవేందర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here