రాజకీయ శిక్షణ శిబిరంలో శేరిలింగంపల్లి ‌కాంగ్రెస్ నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా, బ్లాక్, మండల అధ్యక్షుల రాజకీయ శిక్షణా శిబిరాన్ని హైదరాబాద్ కొంపల్లిలోని ఆస్పీసియన్ కన్వెన్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించారు. మంగళ వారం, బుధవారం రెండు రోజుల పాటు ఈ రాజకీయ శిక్షణా తరగతులు‌ జరగనున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. శిక్షణ తరగతుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికార పార్టీ తప్పులను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు రఘునందన్ రెడ్డి తెలిపారు. ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న వారిలో మారెళ్ల శ్రీనివాస్, సురేష్ నాయక్, నల్లగండ్ల రమేష్, దండె శ్రీనివాస్, నాయకులు జావేద్, సాదిక్, రాము తదితరులు ఉన్నారు.

రాజకీయ శిక్షణ తరగతుల్లో శేరిలింగంపల్లి ‌నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here