చాక‌లి ఐల‌మ్మ‌కు ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చాకలి ఐలమ్మ జ‌యంతి సందర్భంగా ఓల్డ్ హఫీజ్ పేట్ రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో అమ‌రురాలైన చాక‌లి ఐల‌మ్మ పోరాట స్ఫూర్తిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని అన్నారు. ఆమె పోరాట ప‌టిమ భావిత‌రాల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని, యువ‌త ఆమె ఆశ‌య సాధ‌న కోసం ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో రజక సంఘం సభ్యులు మురళీ కృష్ణ, రాజకుమార్, ఆంజనేయులు, అనిల్ కుమార్, M రాజు, జనార్ధన్, శివ కృష్ణ, పుల్లారావు, వినోద్, భాస్కర్, సాయి, విజయ్, చరణ్ పాల్గొన్నారు.

చాక‌లి ఐల‌మ్మ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న ర‌జ‌క సంఘం నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here