- తెరాస సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలసికట్టుగా పనిచేస్తామని తెరాస సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. గురువారం డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్దిని చూసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, సుప్రజ ప్రవీణ్, రవీందర్ రెడ్డి, హరీష్ రెడ్డి, లోకేష్ రెడ్డి, ధరమ్ వీర్, రాము, పీవై రమేష్ పాల్గొన్నారు.

