చందాన‌గ‌ర్ టిక్కెట్ ఎవ‌రికిచ్చినా క‌ల‌సిక‌ట్టుగా ప్రచారం

  • తెరాస సీనియ‌ర్ నాయ‌కుడు మిద్దెల మ‌ల్లారెడ్డి

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్ టిక్కెట్ ఎవ‌రికి ఇచ్చినా అంద‌రం క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేస్తామ‌ని తెరాస సీనియ‌ర్ నాయ‌కుడు మిద్దెల మ‌ల్లారెడ్డి అన్నారు. గురువారం డివిజ‌న్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాల‌యాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెరాస ప్ర‌జ‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, చేస్తున్న అభివృద్దిని చూసి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు ర‌ఘునాథ్ రెడ్డి, సుప్రజ ప్రవీణ్, రవీందర్ రెడ్డి, హరీష్ రెడ్డి, లోకేష్ రెడ్డి, ధరమ్ వీర్, రాము, పీవై రమేష్ పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న మిద్దెల మ‌ల్లారెడ్డి
నినాదాలు చేస్తున్న మిద్దెల మ‌ల్లారెడ్డి, ర‌ఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here