- బుజ్జగిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ,

హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి); హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కారణంగా కాంగ్రెస్ పార్టీ తరపున తన సతీమణిని బరిలో దించిన గౌతమ్ గౌడ్ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ గౌతమ్ గౌడ్ మరో పార్టీ తరపున బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రెండు రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే విషయం తెలుసుకున్నప్రభుత్వ విప్ గాంధీ గౌతమ్ గౌడ్ నివాసానికి చేరుకొని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ లు, పార్టీ అభ్యర్థి తో రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గౌతమ్ గౌడ్ నిర్ణయం పై స్పష్టత రాలేదు.