ట్రాన్స్ కో 1104 యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కమ్మిలి సునీత

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ట్రాన్స్ కో 1104 యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కూకట్ పల్లిలోని అడ్డగుట్టకు చెందిన కమ్మిలి సునీత నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.సాయిబాబా నుంచి సునీత నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి వెంకటేశ్వర్లు, జి.సాయిబాబా, ట్రాన్స్ కో ప్రెసిడెంట్ ఎం.తులసీరాం, వర్కింగ్ ప్రెసిడెంట్ సి.నాగరాజు, అనుబంధ కార్యదర్శి కె.రామచంద్రం, సెక్రటరీ ఎన్.బాలకృష్ణకు సునీత కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్ కార్మికుల పక్షాన న్యాయమైన సమస్యలపై గళమెత్తి పొరాడటానికి గ్రేడ్ వన్ ఆర్టిజన్ గా మెట్రో వెస్ట్ సర్కిల్‌లో ఎస్ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోన్న కమ్మిలి సునీతను 1104 యూనియన్ తర‌పున ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కార్మికుల తర‌పున సంస్థ అభివృద్దికి, ఉద్యోగుల సంక్షేమం కోసం, దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టిజ‌న్ సమస్యలపై పోరాటం చేస్తానని సునీత ప్రకటించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here