సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ ఎన్నిక

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీలో టీఆర్ఎస్ నూతన బస్తీ, మహిళ, యూత్ కమిటీలను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు సాంబశివ రావు, ఏకె బాలరాజ్, బాబుమియా, సలీం, రహ్మాన్ తో కలిసి ఏర్పాటు చేశారు. బస్తి అధ్యక్షునిగా ముక్తార్, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా మొగులమ్మ, యూత్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ ఎన్నికయ్యారు. వీరితో పాటు అన్ని కార్యవర్గాలకు సభ్యులను ఎన్నుకున్నారు.

సుభాష్ చంద్రబోస్ నగర్ లో టీఆర్ఎస్ నూతన బస్తీ కమిటీలతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here