జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల్లో వేగం పెంచాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని మ‌దీనాగూడ నుండి BHEL చౌరస్తా వరకు చేపడుతున్న జాతీయ రహదారి (NH 65) విస్తరణ పనులను ఆర్ అండ్ బి అధికారులు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి NH(65) విస్తరణ పనులలో వేగం పెంచాలని, ఆశించిన మేరకు పనులు జరగడం లేద‌ని, వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం వలన పనులలో జాప్యం నెలకొంద‌ని, దీని మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అని గాంధీ అన్నారు. నిర్దేశించిన గడువులోగా పనుల‌ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. జాతీయ రహదారి విస్తరణ సంతోషకరమైన విషయం అని, ప్రజలకు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు ఈఈ ప్రకాష్, డిఈ రామకృష్ణ, నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్లా, యశ్వంత్, శ్రవణ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here