రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్‌గా మల్లేష్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అఖిల భారత యాదవ మహాసభ విద్యావంతుల వేదిక రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా యేషాం మల్లేష్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు అఖిల భారత యాదవ‌ మహాసభ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలకాని వెంకట్ యాదవ్ మల్లేష్ యాదవ్ కు‌ నియామకపు పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా నియమాకమైన మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు. అఖిల భారత యాదవ మహాసభ విద్యావంతుల వేదిక రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ నియామకానికి సహకరించిన వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదవ విద్యావంతుల వేదిక అధ్వర్యంలో నిర్వహించనున్న యాదవ ఆత్మగౌరవ సభ విజయవంతం చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. యాదవ విద్యావంతుల వేదిక ముఖ్య సంకల్పం హైదరాబాద్ లో యాదవ్ విద్యార్ధి వసతి గృహ నిర్మాణము దీనికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

అఖిల భారత యాదవ మహాసభ విద్యావంతుల వేదిక రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్‌గా నియామకమైన మల్లేష్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here