మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని నరేన్ గార్డెన్స్లో శ్రీ హవాయి మల్లినాథ్ మహారాజ్ నిర్గుడి గుల్బర్గా స్వామిజీ శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. జై భారత్ మాత సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లద్దె నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, టీటీడీ బోర్డ్ కమిటీ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, ప్రభాకర్ రావు, విఠల్, సుబ్రహ్మణ్యం, అంబాల మహేశ్, నడిమింటి కృష్ణ, ఇలియాస్ షరీఫ్, అనిల్ రెడ్డి, వై.వి.రమణ, వీరేశం పాల్గొన్నారు.