శేరిలింగంపల్లి, డిసెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో శివ్లి పాఠశాలకు చెందిన 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ డాక్టర్ పి.రామచంద్రా రెడ్డి, ప్రిన్సిపల్ శిరీష రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిజయ కేతన్ షావో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షావో విద్యార్థులకు విద్య, క్రమ శిక్షణ, విలువల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కె.సాయికృష్ణ, కె.రఘుపతి రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.






