శివాజీ నగర్ లో కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పర్యటన

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనిలో చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మంగళవారం పర్యటించారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలోని పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, సబ్ ఇన్ స్పెక్టర్ రాములు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, లక్ష్మినారాయణ గౌడ్, ఎస్ ఎన్ రెడ్డి, అక్బర్ ఖాన్, రామస్వామి, సందీప్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, కాలనీ వాసులు రామారావు, అంజిరెడ్డి, వెంకట్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

శివాజీ నగర్ లో మొక్కలు నాటుతున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here