శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం డాక్టర్ రమాదేవి, వారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరిని ఆధ్యంతం అలరించింది. కూచిపూడి కింకిణి రవళి లో కళాకారులు తమ ప్రదర్శనలో భాగంగా శ్రీ మహా గణపతిమ్, భో శంభో, తంజావూర్ చిన్నయ రచించిన జావళి , మామవతు శ్రీ సరస్వతి, అన్నమాచార్య కీర్తన అలరులు కురియగా ఆడినదెయ్, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కళాకారులు డాక్టర్ రమాదేవి, స్థిర, కృతిక, ప్రియా, ధృతి, ఐశ్వర్య, తదితరులు నృత్య ప్రదర్శన చేసి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

శిల్పారామంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here