శిల్పారామంలో మొక్కలు నాటిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ శశిథరూర్ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులతో కలిసి బుధవారం శిల్పారామంలోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వెళుతుందని, ఇప్పటివరకు 16 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శశిథరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందం మహువా మొయిత్ర, సయ్యద్ జాఫర్ ఇస్లాం, నరేంద్ర జాదవ్, సుమతి తమిజిచ్చీ,తంగపాండియన్‌, ధైర్యశీల్ సంభాజిరావు మానే, శక్తిసింహ్ గోహిల్, నదిముల్ హాక్, పి.ఆర్.నటరాజన్, సంతోష్ పాండే పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంపీ రంజిత్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు.

శిల్పారామంలో మొక్కలు నాటుతున్న శశిథరూర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here