కేంద్ర మంత్రి బండి సంజయ్ కి న్యూఢిల్లీలో శుభాకాంక్షలు తెలిపిన రాగిరి సాయిరాం గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ ని శేరిలింగంపల్లికి చెందిన బీజేవైఎం జాతీయ నాయకుడు రాగిరి సాయిరాం గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని అధికార నివాసంలో బండి సంజయ్ ని కలిసిన రాగిరి సాయిరాం గౌడ్ వారిని ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన సంజయ్ కి సముచిత స్థానం కల్పించినందుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలకి రాగిరి సాయిరాం గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలుపుతున్న రాగిరి సాయిరాం గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here