- ఉపాధ్యక్షులుగా కట్టుకూరి నట్రాజ్గుప్త, సహాయ కార్యదర్శిగా మాశెట్టి ప్రభాకర్ గుప్త
- యువజన విభాగం ఉపాధ్యక్షులుగా మారం ప్రసాద్ గుప్త, మునిగల సంతోష్ గుప్త
నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో శేరిలింగంపల్లి ఆర్యవైశులకు పెద్దపీట వేశారు. నగరంలోని బొబ్బిలి దామోదర్రెడ్డి గార్డెన్స్లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశం గుప్త నేతృత్వంలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శేరిలింగంపల్లికి తారానగర్ ప్రాంతానికి చెందిన కట్టుకూరి నటరాజ్ గుప్త ఉపాధ్యక్షుడిగా, మాశెట్టి ప్రభాకర్ గుప్త సహాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అదేవిధంగా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా మారం ప్రసాద్ గుప్త, మునిగల సంతోష్ గుప్తలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకరాం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి భాధ్యతలు అప్పగించిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా, రాష్ట్ర కర్యవర్గ పెద్దలకు, తమను ప్రోత్సహిస్తున్న శేరిలింగంపల్లి ఆర్యవైశ్య బంధువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆర్యవైశ్యులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఆర్యవైశ్య సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. ఆర్యవైశ్యులు సామాజికంగా, రాజకీయంగా ఎదేగేందుకు తమవంతు భాధ్యత పోషిస్తామని అన్నారు.
