- మాజీ ఎంపీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జీ గరికపాటి మోహన్రావు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతాపార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లి ఆద్వర్యంలో చందానగర్ క్రిస్టల్ గార్డెన్స్లో ఆదివారం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు, శేరిలింగంపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జీ గరికపాటి మోహన్రావు మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అటు విద్యార్థులను ఇటు ఉద్యోగస్థులను దెబ్బతీశారని, లక్షల ఉద్యోగాలు ఇస్తానంటు యువతను నిరుద్యోగులుగా మర్చారన్నారు. పీఆర్సీ ఇప్పుడు అప్పుడు అంటూ ఉద్యోగులను ఎప్పటికప్పుడు వాడుకోని వదిలేశాడని అన్నారు. కరోనా కాలంలో కేసీఆర్ నిర్లక్షం వల్ల ప్రజలు ఎంతో అవస్థలు పడ్డారని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది దాదాపు 3 లక్షల మంది, అదేవిధంగా దాదాపు 1 లక్ష మందికి పైగా వైద్య సిబ్బంది నేటికి కోలుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు మల్లీ జరగరాదంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఆలోచన చేసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో దేవి ప్రసాద్ను ఓడించి కేసీఆర్ అహంకారాన్ని బద్దలుకొట్టిన గ్రాడ్యూయేట్లు ఈ సారీ అదేపంథా కొనసాగిస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, కేసీఆర్ తన కపట బుద్దిని మరోసారి రుజువుచేస్తూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవిని బలిపశువును చేస్తున్నారని అన్నారు. గెలిచే సీటును తన బిడ్డకు ఇచ్చి, ఓడిపోయే సీటును పీవీ బిడ్డకు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే పట్టభద్రులు వాస్తవాలను గుర్తెరిగి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 1 నుంచి 12 వరకు ఓటర్ సమ్మేళనాలు కొనసాగుతాయని. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ప్రభారీ భాద్యత వహిస్తారని అన్నారు. ఎన్నికల తేదీ వరకు ప్రతి ఓటరును కనీసం ఐదు సార్లు కలిసేలా ప్రభారీలు చొరవ చూపాలని సూచించారు. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో మెజారిటీ వచ్చిందని, ఈ సారి అంతకు మించిన ఫలితాలు ఉంటాయని ఆశాబావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.బిక్షపతి యాదవ్, గజ్జల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, నరేష్, బాల్ద అశోక్, కసిరెడ్డి భాస్కర రెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, వసంత్ కుమార్ యాదవ్, తోపుగొండ మహిపాల్ రెడ్డి, రాఘవేందర్ రావు, జిల్లా పధాదికారులు, పది డివిజన్ ల అధ్యక్షులు, పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
