శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్ A బ్లాక్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ప్రధాన రహదారి నుండి కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వరకు రోడ్డు వేయాల,ని కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డును వేయాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే శ్రీరాం నగర్ కాలనీలో పర్యటిస్తానని అన్నారు. శ్రీ రాం నగర్ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రి వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చాంద్ పాషా, శ్రీ రాం నగర్ కాలనీ ప్రెసిడెంట్ శివకుమార్, విజయ్ కుమార్ , వెంకట రమణ, రాజ్ కుమార్, నారాయణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.