స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎమ్మెల్యేకు మాధ‌వీ న‌గ‌ర్ వాసుల విన‌తి

కూక‌ట్‌ప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మాధవి నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయ‌న‌ నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మాధవి నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు క‌ల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అన్నారు. కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డు ప‌నులను చేయాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ త్వరలోనే మాధవీ నగర్ కాలనీ లో పర్యటిస్తానని, మాధవి నగర్ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మధుసూదన్ రెడ్డి, రఘు కుమార్, చిన్నా రెడ్డి, కార్తీక్, అనిల్ కుమార్, రాంమోహన్ రావు, మురళి, ఆంజనేయులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని క‌లిసిన మాధ‌వీ న‌గ‌ర్ కాల‌నీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here