భెల్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్డర్లు లేక నష్టాలను చవిచుస్తున్న భెల్ ఆర్సీ పురం యూనిట్ కు ఆర్డర్స్ వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ భెల్ ఎగ్జిక్యూటివ్ -సూపర్వైజర్ అసోసియేషన్ ప్రతినిధులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మెమోరాండం సమర్పించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో భెల్ పరిస్థితిపై చర్చించి సంస్థకు ఆర్డర్స్ వచ్చేలా సహకారం అందించాలని కోరారు. జిల్లా తెరాస నాయకుడు మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని కలిసి పరిశ్రమ పరిస్థితిని వివరించారు. దీనిపై ఎంపీ ప్రభాకర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖతో చర్చిస్తామన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు రవి కిరణ్ గౌడ్, బన్సీ, రామాంజనేయులు, సురేందర్, కృషంరాజు, నందు, రాము, నీలకంఠం పాల్గొన్నారు.
